భావదేవరపల్లిలో పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభం


Sakshi | Updated: June 15, 2013 14:16 (IST)
India :నాగాయలంక : కృష్ణాజిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. నాగాయలంక మండలం భావదేవరపల్లి ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలను ఆయన ప్రారంభించారు. కళాశాలలో సీట్ల శాతాన్ని పెంచుతామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. కళాశాల వెబ్‌సైట్ ప్రారంభించి విద్యార్థులు, మత్స్యకారులతో మాట్లాడారు. రూ.67.17 కోట్లతో చేపట్టిన తుపాను అత్యవసర పనులు ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ నీలం తుఫాను బాధితుల్ని ఆదుకుంటామని తెలిపారు. అలాగే జిల్లాలోని బ్రిడ్జిలకు సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

Krishna River Lighthouse Tour

cyclones and adverse atmospheric conditions in the sea